Friday, May 3, 2024
Home వార్తలు వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

- Advertisement -

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వాళ్లు జైలులోనే ఉన్నారు. మరో పక్క ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ నుండి పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని తులశమ్మ ఆరోపించారు. మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని సీబీఐని తులశమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ఆర్ధిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయనీ, ఆ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు.

వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రసాద్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, రాజశేఖరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తులశమ్మ కోరారు. తులశమ్మ గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొమ్మిది నెలల తర్వాత కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా పులివెందుల కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకరరెడ్డి కడప జైలులోనే ఉన్నారు. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...