Sunday, May 5, 2024
Home వార్తలు Balineni: బాలినేనికి అసంతృప్తి లేదు(ట)..! జగన్ తో భేటీ అనంతరం వెల్లడి..!!

Balineni: బాలినేనికి అసంతృప్తి లేదు(ట)..! జగన్ తో భేటీ అనంతరం వెల్లడి..!!

- Advertisement -

Balineni: తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. కొత్త మంత్రి వర్గంలోకి బాలినేనిని తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తికి గురైయ్యారనీ, రాజీనామాకు సిద్దమయ్యారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఈ రోజు బాలినేనితో సమావేశమైయ్యారు. ఒంగోలులో బాలినేని అనుచరులు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నేటి నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి బాలినేని దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో జగన్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి పలువురు నేతలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుని జగన్ తో సమావేశమైయ్యారు. సుమారు గంట పాటు జగన్ తో భేటీ కొనసాగింది. అనంతరం బాలినేని మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

తనకు ఎటువంటి అసంతృప్తి లేదని బాలినేని స్పష్టం చేశారు. మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తాము వైఎస్ఆర్ కుటుంబానికి, జగన్ కు విధేయులమని పేర్కొన్నారు. రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. పార్టీ యే బాధ్యతలు అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆదిమూలపు సురేష్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కలిసి పని చేశామన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ సీపీదేనని అన్నారు. సజ్జల, తాను ప్రతి వారం కలుస్తూనే ఉంటామనీ అలానే నిన్న ఈరోజు కలిశారనీ, అందులో ప్రత్యేకం ఏమిలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో గతంలో వచ్చిన స్థానాలకంటే ఎక్కువగా వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ నెల 22వ తేదీన ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన ఉందని దానిపై చర్చించినట్లు బాలినేని తెలిపారు.

- Advertisement -

బాలినేని మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఒంగోలు పట్టణంలో నిన్న రాత్రి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం కూడా చేశారు. పార్టీ కార్యాలయం వద్ద జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....