ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాలి..పోలవరం నిర్మాణం జరగాలి. రాష్ట్రానికి తలమానికం అయిన స్టీల్ ప్లాంట్ నిలబడాలి.రైతు రాజు అవ్వాలి..రైతులకి రుణమాఫీ జరగాలని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల తెలిపారు. శనివారం ఒంగోలులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ..టిడిపి,వైసిపి పార్టీలు బిజెపి కి బానిసలు గా మారి రాష్ట్ర భవిష్యత్తు ను తాకట్టు పెట్టాయి కనుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టవలసి వచ్చిందని వెల్లడించారు. నా సొంత వాళ్ళు అనుకొని 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశాను.నా రక్తం దారపోసా..మనసు పెట్టి పనిచేశా..ఇప్పుడు నా మీద ముప్పేట దాడి చేస్తున్నారు.ఇక్కడ ఉంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎంత విమర్శించిన భయపడేది లేదు అని తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజశేఖర్ రెడ్డి కట్టిన ప్రాజెక్ట్ ను మెయింటైన్ చెయ్యలేకపోతే మీరు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను నిలబెట్టేవారు ఎలా అవుతారు అని ప్రశ్నించారు.
ఇది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు…. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయి రెడ్డి,అర్ అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి ల పార్టీని అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చాక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు. ఆ చేసిన అప్పుల్లో అభివృద్ధి ఉన్నదా,పోలవరం ను పూర్తి చేశారా?రాజధాని కట్టారా?అని ప్రశ్నించారు.పొరుగు రాష్ట్రాల్లో మాదిరిగా మన రాష్ట్రంలో ఒక్క మెట్రో అయిన ఉన్నదా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం లో బాగంగా 750 కోట్లు ఖర్చు చేసి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు.16 నెలల క్రితం ఒక గేటు,మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయింది. జలయజ్ఞం లో అవినీతి జరిగింది కాబట్టే ఈ ప్రాజెక్టు కొట్టుకుపోయింది టిడిపి వారు అసత్య ఆరోపణలు చేస్తున్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పదవలో ఉండగా ప్రాజెక్టు కోసం మైంటైన్స్ కింద నిధులు విడుదల చేస్తే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు…యాన్యువల్ మైంటే నన్స్ కింద ఎమ్ చేశారు. టిడిపి వారు వైసిపి మీద …వైసిపి వారు టిడిపి మీద విమర్శించకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని ఆమె తెలిపారు.ప్రత్యేక హోదా తీసుకురావాలన్న,విశాఖ ఉక్కును కాపాడలన్న , పోలవరం వెలిగొండలను నిర్మించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని పిలుపునిచ్చారు.