Home వార్తలు జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని కోర్టులో హాజరుపర్చారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు సతీష్ కు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మైనర్ అని అతనకి నేర చరిత్ర లేదని నిందితుడి తరుపు న్యాయవాది సలీం వాదించారు. ఈ కేసులో సెక్షన్ 307 వర్తించదని తెలిపారు.

Exit mobile version