రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన రాతియుగం కావాలో..టీడీపీ పాలనలో స్వర్ణయుగం కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం నిర్వహించిన రా..కదలిరా సభలో ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధి-ప్రజాసంక్షేమానికి పాటుపడే టీడీపీ – జనసేన ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టాలని కోరారు.సభకు హాజరు అయిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ..కొత్త సంవత్సరంన మీ అందరిలో కొత్త ఆశ కనిపిస్తుందని పేర్కొన్నారు.ఐదు సంవత్సరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పేద వాళ్ల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.పేదలు నిరుపేదలుగా మారిపోయారని..యువత నిరుద్యోగులుగా మారిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆళ్లగడ్డ లో నేషనల్ హైవే సంస్కరణల కు తెలుగుదేశం నాంది పలికింది అని తెలిపారు.యువతకు ఐటి ఆయధంగా ఇచ్చామని వెల్లడించారు.
ఐదు సంవత్సరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన పేద వాళ్ల పాలిట శాపంగా మారిందని విమర్శించారు.అనర్హులకు, అసమర్థులకు అధికారం ఇచ్చామని అదే మన కష్టమని పేర్కొన్నారు.ప్రతి ఇంటినీ,ప్రతి ఊరిని నాశనం చేసిన చరిత జగన్మోహన్ రెడ్డి దని మండిపడ్డారు. రద్దులు, గుద్దులు, నొక్కుడు,కూల్చివేతలు,దాడులు,కేసులు తప్ప జగన్ కు ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రారంభమే ప్రజా వేదిక కూల్చి రాష్ట్రాన్ని నస్టాలపాలు చేస్తూ విధ్వంసకర పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో తనతో సహా అందరూ భాధితులేనని అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నందికొట్కూరు లో 650 కోట్ల రూపాయల తో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశామని పేర్కొన్నారు. అది పూర్తి అయ్యి ఉంటే కర్నూల్ జిల్లాలో ప్రతి రైతు విత్తనాలు పండించే వారని, ప్రపంచానికి విత్తన సరఫరాకు కేంద్రంగా నంద్యాల జిల్లా ఉండేదని పేర్కొన్నారు. ఓర్వకల్లు లో 15 నెలలలో ఎయిర్పోర్ట్ పూర్తి చేశామని పేర్కొన్నారు.టిడిపి ప్రారంభించిన పరిశ్రమలను కొనసాగిస్తే కర్నూల్ ఒక పారిశ్రామికవాడ హబ్ గా తయారు అయ్యేది పేర్కొన్నారు.
6000 మెగా వాట్లతో సోలార్ పార్క్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.
- రాయలసీమను రాళ్లసీమగా మార్చిన జగన్..
మొట్ట మొదటి సారిగా రాయలసీమను రత్నాల సీమగా నాంది పలకాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ నీటిపారుదల కు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. మిగులు జలాలు అన్ని రాయలసీమ కు తీసుకురావాలని, ఎన్టీఆర్ కృషి చేశారన్నారు. గతంలో. ముచ్చుమర్రి, గిరకల్లు,ఆవుకు టన్నెల్, పూర్తి చేశామని వెల్లడించారు. ఈ ఐదేళ్ల కాలంలో రాయలసీమలో ఒక్క ప్రాజెక్ట్ అయిన జగన్మోహన్ రెడ్డి కట్టారా అని ప్రశ్నించారు.టిడిపి ప్రభుత్వం రాయలసీమకు రూ .12,450 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని వెల్లడించారు.ఒక్క పరిశ్రమ తీసుకురాలేని ,ఒక్క ప్రాజెక్ట్ కట్టలేని ..జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి అని ధ్వజమెత్తారు. గతంలో ముచ్చుమర్రి లఫ్ట్ ఇరిగేషన్ కు పనులు చేశామని తెలిపారు .శ్రీశైలం లో నీరు పొదుపు చేయాలన్న ఉద్దేశంతో కృష్ణ డెల్టాకు పట్టిసీమ ద్వారా 120 టిఎంసి ల నీరును తీసుకువచ్చామన్నారు. ఆ మిగులు నీటిని రాయలసీమ మొత్తానికి ఇచ్చామన్నారు. గోదావరి నుంచి బనకచర్ల నీటిని తీసుకువచ్చేందుకు రాబోయే ప్రభుత్వంలో కృషి చేస్తామని పేర్కొన్నారు. గోదావరి నీటిని నేరుగా నాగార్జున సాగర్ కు తీసుకువచ్చి, అక్కడ నుంచి నల్లమల అడువుల్లో టన్నెల్ ద్వారా బనకచర్ల కి తీసుకురావాలన్న దూరదృష్టి తనకు ఉందని పేర్కొన్నారు. రైతులకి నీళ్ళు,యువతకు ఉద్యోగాలు,పిల్లలకు చదువు,మౌలిక సదుపాయాలు అన్ని కల్పిస్తే రాయలసీమ రత్నాల సీమ అవుతుందని అదే తన ధ్యేయమని పేర్కొన్నారు.