Home వార్తలు ఒంగోలు వైసీపీలో విషాదం: నగర పార్టీ అధ్యక్షుడు ఆకస్మిక మరణం..!

ఒంగోలు వైసీపీలో విషాదం: నగర పార్టీ అధ్యక్షుడు ఆకస్మిక మరణం..!

ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు వైసీపీలో విషాదం నెలకొంది. వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు ఇవేళ తెల్లవారుజామున మృతి చెందారు. వెంకట్రావు గత కొద్ది నెలలుగా బ్లడ్ కాన్సర్ తో బాధపడుతున్నారు. అయితే అతనికి కాన్సర్ సోకిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. ఇటీవల ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజుల నుండి ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.

సింగరాజు వెంకట్రావు వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పని చేశారు. సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. నగరంలో పార్టీకి గట్టిగా పని చేయడంతో నగర పార్టీ అధ్యక్షుడుగా నియమితులైయ్యారు. సింగరాజు వెంకట్రావు మృతితో ఒంగోలు వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. కాగా రేపు మాజీ మంత్రి బాలినేని కుటుంబ సమేతంగా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్న తరుణంలో ఈ విషాద ఘటన జరిగింది.

Exit mobile version