Lovers Suicide: ఇటీవల కాలంలో ప్రేమికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. యుక్త వయస్సులో ప్రేమలో పడటం, వారి ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న భయంతో ఇల్లు వదిలి పారిపోవడం, లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కలిసి బ్రతకలేపోతే కలిసి చనిపోదాం అని నిర్ణయించుకుంటున్నారు. వీరి తొందర పాటు నిర్ణయాలతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. తాజాగా బాపట్ల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
బాపట్ల జిల్లా చిన గంజాం మండలం అడివీధిపాలెం లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారు పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రేమ జంట మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, తేజగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.