Friday, April 26, 2024
Home వార్తలు MLA Gottipati Ravi Kumar: వెల్లంపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రవికుమార్..!!

MLA Gottipati Ravi Kumar: వెల్లంపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రవికుమార్..!!

- Advertisement -

MLA Gottipati Ravi Kumar: పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, అకాల వర్షాలు, లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెల్లంపల్లి పొగాకు కొనుగోళ్లు  కేంద్రాన్ని సోమవారం ఆయన రైతులు, పొగాకు బోర్డు అధికారులతో కలసి సందర్శించి వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు. నోబిడ్లు లేకుండా మద్దతుధర లభించేలా చూడాలని అధికారులను కోరారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో పొగాకు కేజీ ధర రూ.263లు లభిస్తుంటే మన రాష్ట్రంలో కేజీ ధర కేవలం రూ.180లకే కొనుగోలు చేస్తున్నారన్నారు. అయిదేళ్ల క్రితమే లోగ్రేడ్ పొగాకు ధర రూ.120 పలికిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కేవలం రూ.60 నుండి రూ.100లు మాత్రమే లభిస్తుందన్నారు. ఇలాగే కొనసాగితే రైతు పొగాకు పంట పండించే పరిస్థితి ఉండదని రవికుమార్  అన్నారు.

గతంలో లోగ్రేడ్ పొగాకును మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్త చేసిన రవికుమార్ ఈ ఎడాది ఎందుకు కొనుగోలు చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే రైతులు పొగాకు సాగు తక్కువగా సాగు చేసినప్పటికీ గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమన్నారు. ఈ కారణాల వల్ల భవిష్యత్తులో పొగాకు పంట సాగు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగుకు పెట్టుబడి వ్యయం కూడా విపరీతంగా పెరిగిందనీ, రైతుల ఇబ్బందులను గుర్తించి పొగాకు బోర్డు నుంచి బ్యారెన్ కు లక్ష వరకూ ఆర్ధిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకులతో సంప్రదించి పొగాకు రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయాలని రవికుమార్  కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా మొక్కజొన్న, ధాన్యం రైతులకు డబ్బులు చెల్లించకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ప్రకాశం జిల్లాలో మూడు నెలల క్రితం 26 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేయగా 13 వేల మెట్రిక్ టన్నుల కు మాత్రమే రైతులకు డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. రైతులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 23 కోట్ల బకాయిలు తక్షణమే రైతులకు అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే రవికుమార్ విజ్ఞఫ్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

Most Popular

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...