Friday, April 26, 2024
Home వార్తలు వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

వివేకానందరెడ్డి హత్య కేసులో బిగ్ ట్విస్ట్ .. తొమ్మిది నెలల తర్వాత తులశమ్మ వాంగ్మూలం నమోదు

- Advertisement -

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా పలువురిని సీబీఐ అరెస్టు చేసింది. వాళ్లు జైలులోనే ఉన్నారు. మరో పక్క ఈ కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ నుండి పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని తులశమ్మ ఆరోపించారు. మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని సీబీఐని తులశమ్మ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో ఆర్ధిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయనీ, ఆ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు.

వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రసాద్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, రాజశేఖరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తులశమ్మ కోరారు. తులశమ్మ గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొమ్మిది నెలల తర్వాత కోర్టు వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా పులివెందుల కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకరరెడ్డి కడప జైలులోనే ఉన్నారు. ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

Most Popular

ఎన్నికల్లో క్విక్ పోలీసింగ్ కై సమర్థ్ యాప్ దోహదం: ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో మే 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు “సమర్థ్” ("సెక్యూరిటీ ఆరెంజ్ మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్...

పవన్ కళ్యాణ్ మద్దతుగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్

జనసేనాని గెలుపు కోసం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో దిగనున్నారు. పిఠాపురం అసెంబ్లీ ఎన్డీయే అభ్యర్థి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ఏప్రిల్ 27...

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...