పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించాల్సిన వలంటీర్ వ్యవస్థను రాజకీయ అవసరాలకోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసిందని గతంలో సిపియం తరుపున పదే పదే ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. దాని ఫలితంగానే ఈరోజు సకాలంలో పెన్షన్లు అందించలేని దుస్తితి ఏర్పడిందని సిపిఎం విమర్శించింది. ఇప్పటికైనా వలంటీర్ వ్యవస్థ తటస్థంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరింది.ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో వలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ నిలిపివేయడం వల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సకాలంలో వృద్దులు, మహిళలు, వికలాంగులకు పెన్షన్లు అందించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎన్నికల కమీషన్కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయం, రెవెన్యూ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకొని గతంలో వలే నేరుగా పెన్షన్దారులకు అందించాలని కోరారు. సచివాలయాలు దూరంగా ఉన్నచోట దగ్గరలో ఉండే పంచాయతీ కార్యాలయాలు, సిబ్బందిని కూడా దీనికి ఉపయోగించుకోవాలని తెలిపారు.
.
వైసిపి విధానాలే పెన్షన్ల దుస్థితికి కారణం : సిపిఎం
- Advertisement -
- Advertisement -