Sunday, May 5, 2024
Home వార్తలు రక్తం ఏరులై పారితే …సాక్షిలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు ? : షర్మిల

రక్తం ఏరులై పారితే …సాక్షిలో హార్ట్ ఎటాక్ అని ఎలా చెప్పారు ? : షర్మిల

- Advertisement -

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకు గురై ఇంట్లో రక్తం ఎరులు అయ్యి పారితే …హార్ట్ ఎటాక్ అని సాక్షి చానెల్ లో ఏ విధంగా చెప్పారు.? సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారు? ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ విచారణ కోరిన జగన్మోహన్ రెడ్డి , అధికారం వచ్చిన తరువాత విచారణ ఎందుకు అవసరం లేదని అన్నారో కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిళ డిమాండ్ చేశారు. శనివారం కడప పార్లమెంట్ పరిధిలో బస్ యాత్ర లో ఆమె మాట్లాడుతూ..హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి ఓట్లు వేయకూడదన్న నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. వైసిపి తరుపున కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో ఉన్న అవినాష్ రెడ్డిని అడ్డుకునేందుకే తాను బరిలోకి దిగినట్లు ఆమె తెలిపారు. రాబోయే ఎన్నికల్లో న్యాయానికి అధికారానికి , ధర్మానికి ,డబ్బుకు మధ్య జరుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు.

బిజెపికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు బానిస అయ్యారు?

- Advertisement -

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముస్లిం లను ఎంత ప్రేమించారో…బీజీపీ ని అంత వ్యతిరేకించేవారు. బిజెపి ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టీ ఆ మంటల్లో చలి కాచుకొనేది బీజీపీ అని మండిపడ్డారు. గోద్రా అల్లర్ల పై ముస్లిం మిద దాడులకు వ్యతిరేఖంగా రాజశేఖర్ రెడ్డి పోరాడితే…..మణిపూర్ లో మైనార్టీ నాయకులు మిద జరిగిన దాడులపై జగన్మోహన్ రెడ్డి నోరు అయినా విప్పారా అని నిలదీశారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....