Monday, April 29, 2024
Home వార్తలు ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్లీన్ చిట్

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్లీన్ చిట్

- Advertisement -

ఒబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా శ్రీలక్ష్మి ఉన్నారు. 2004 నుండి 2009 వరకూ శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన కాలంలో ఓబులాపురం మైనింగ్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా సీబీఐ కేసు నమోదు చేసింది.

తనను ఈ కేసు నుండి తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సీబీఐ కోర్టు గత నెల 17న కొట్టివేయడంతో శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ఇవేళ ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. నిర్దోషిగా ప్రకటించింది. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు సీబీఐ అందించలేకపోవడంతో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టు నుండి ఇంతకు ముందే మధ్యంతర ఉత్తర్వులు పొందిన కారణంగా ఇటీవల సీబీఐ కోర్టు శ్రీలక్ష్మి మినహా ఇతర నిందితులపై అభియోగాల నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...