Friday, May 10, 2024
Home వార్తలు ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్లీన్ చిట్

ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి క్లీన్ చిట్

- Advertisement -

ఒబులాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టు ఆమెపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒఎంసీ కేసులో ఆరవ నిందితురాలిగా శ్రీలక్ష్మి ఉన్నారు. 2004 నుండి 2009 వరకూ శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన కాలంలో ఓబులాపురం మైనింగ్ లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా సీబీఐ కేసు నమోదు చేసింది.

తనను ఈ కేసు నుండి తప్పించాలంటూ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ ను సీబీఐ కోర్టు గత నెల 17న కొట్టివేయడంతో శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై తొలుత మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు ఇవేళ ఆమెపై ఉన్న అభియోగాలను కొట్టివేసింది. నిర్దోషిగా ప్రకటించింది. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు సీబీఐ అందించలేకపోవడంతో కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చింది. హైకోర్టు నుండి ఇంతకు ముందే మధ్యంతర ఉత్తర్వులు పొందిన కారణంగా ఇటీవల సీబీఐ కోర్టు శ్రీలక్ష్మి మినహా ఇతర నిందితులపై అభియోగాల నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...