Home వార్తలు Dwaraka Tirumala: ఇఓపై ఫిర్యాదు..చీటింగ్ చేశారట..!

Dwaraka Tirumala: ఇఓపై ఫిర్యాదు..చీటింగ్ చేశారట..!


Dwaraka Tirumala: ద్వారకా తిరుమల ఆలయ ఇఓ తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు నేరుగా ఫిర్యాదు చేయడం ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ద్వారకా తిరుమల ఆలయంలోని కేశకంఢనశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన వద్ద ఆలయ ఇఓ జీవి సుబ్బారెడ్డి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన సాంబశివరావు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆయన నేరుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు.

దేవాదాయ శాఖలో చాలా కాలంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసిబీ అధికారుల తనిఖీల్లో పలు ఆలయాల్లో జరిగిన అవినీతి అక్రమాలు గతంలో వెలుగు చూశాయి. అక్రమాలు వెలుగు చూసినా సిబ్బందిపైనే వేటు వేస్తున్నారు కానీ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

Exit mobile version