Chandrababu: ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం అవ్వడం పట్ల ప్రకాశం జిల్లా నేతలను పార్టీ అధినేత చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సోమవారం
చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశాన్ని ఆన్ లైన్ లో నిర్వహించారు. ఒంగోలు మహానాడు ప్రజా విజయంగా అభివర్ణించారు చంద్రబాబు. మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.
క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని మరింతగా
ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అరాచక, విధ్వంస పాలనపై తిరుగుబాటుకు మహానాడు వేదిక అయ్యిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుకు మహానాడు తో భరోసా వచ్చిందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో భాగంగా నెలకు రెండు జిల్లాల్లో తాను పర్యటించనున్నట్లు
చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పన్ను పోటు, ధరల భారంపై బాదుడే బాదుడు కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు చంద్రబాబు.ఒంగోలు లో మహానాడు గ్రాండ్ సక్సెస్ చేసేందుకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు టీమ్ వర్క్ చేసిన సంగతి తెలిసిందే.