పింఛన్ల పంపిణీ వాలంటీర్ల ద్వారా వద్దని… ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటకి… రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పట్టించుకోలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 33 మంది పెన్షన్ దారులు చనిపోయారు. సిఎస్ జవహార్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని కేంద్ర మానవ హక్కుల సంఘానికి టిడిపి జనసేన బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మానవ హక్కుల మండలిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు ప్రసంగించారు. రాష్ట్రంలో పెన్షన్ చెల్లింపుల సమస్యపై జవహర్ రెడ్డిపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని వారు మానవ హక్కుల సంఘాలకు విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ వైసీపీకి మద్దతుగా జవహర్ రెడ్డి వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పింఛన్ పంపిణీకి అవసరమైన నిధులు సకాలంలో అందించని ఇతర ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.