Home వార్తలు రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్రంలో వచ్చేనెల 13 న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఓటర్లను ప్రలోభపర్చే నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఇతర వస్తువుల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘాను ఉంచడం ఉంచామన్నారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులతో పాటు రాష్ట్రంలోని పలు చెక్ పోస్టుల ద్వారాను.. పోలీస్, ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్సు, ఫారెస్టు, ఇడి, ఎన్సీబి, ఆర్పిఎఫ్, కస్టమ్స్ తదితర 20 ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలకు పైబడి ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కాస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫలితంగా ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం చేశామని తెలిపారు. ఇందులో కేవలం గత 24 గంటల్లోనే రూ.8.65 కోట్ల విలువైన అక్రమ రవాణా ఆస్తులను స్వాదీనం చేసుకోవడం జరిగిందన్నారు. నేటి వరకూ స్వాదీనం చేసుకున్న మొత్తం రూ. 165.91 కోట్లలో అత్యధిక మొత్తం రూ.30.66 కోట్లు అనంతపూర్ పార్లమెంటరీ నియోజక వర్గంలోనూ అత్యల్పంగా రూ.1.15 కోట్లు నర్సాపురం పార్లమెంటరీ నియోజక వర్గంలోను స్వాదీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. నేటి వరకూ స్వాదీనం చేసుకున్న మొత్తం సొమ్ములో రూ.36.89 కోట్లు నగదు, రూ.20.32 కోట్ల విలువైన 6,62,402.65 లీటర్ల లిక్కరు, రూ.2.78 కోట్ల విలువైన 52,28,218.94 గ్రాముల డ్రగ్స్, రూ.91.26 కోట్ల విలువైన 14,73,734.46 గ్రాముల ప్రెషస్ మెటల్, రూ.2.90 కోట్ల విలువైన 4,88,557 ఫ్రీ బీస్ (ఉచితాలు) మరియు రూ.11.74 కోట్ల విలువైన 11,27,451.07 ఇతర వస్తువులను స్వాదీనం చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

                                                                                                                                                                                                         పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువ
                                                                                                                                                                                   అత్యధిక మొత్తం రూ.30.66 కోట్లు అనంతపురం పి.సి.లోను మరియు అత్యల్పంగా రూ.1.15 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను నర్సాపురం పి.సి.లోను స్వాదీనం చేసుకోవడం జరిగింది. పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా అత్యధికం నుండి అల్యల్పంగా స్వాదీనం చేసుకున్న పార్లమెంటరీ నియోజక వర్గాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురంలో రూ.30.66 కోట్లు, తిరుపతి (ఎస్సీ) లో రూ.19.37  కోట్లు, కాకినాడలో రూ.18.18 కోట్లు, ఏలూరులో రూ.13.77 కోట్లు, విశాఖపట్నంలో రూ.12.50 కోట్లు, రాజంపేటలో రూ.6.96 కోట్లు, విజయవాడలో రూ.6.75 కోట్లు, నంద్యాలలో రూ.5.63 కోట్లు, కడపలో రూ.5.62 కోట్లు, నర్సరావుపేటలో రూ.4.61 కోట్లు, విజయనగరంలో రూ.4.18 కోట్లు, బాపట్ల (ఎస్సీ)లో రూ.3.99 కోట్లు, అనకాపల్లి లో రూ.3.72 కోట్లు, రాజమండ్రిలో రూ.3.62 కోట్లు, శ్రీకాకుళంలో రూ.3.61 కోట్లు, అరకు (ఎస్టీ)లో రూ.3.37 కోట్లు, నెల్లూరులో రూ.3.00 కోట్లు, మచిలీపట్నంలో రూ.2.87 కోట్లు, గుంటూరులో రూ.2.75 కోట్లు, కర్నూలులో రూ.2.45 కోట్లు, చిత్తూరు (ఎస్సీ)లో రూ.1.94 కోట్లు, ఒంగోలులో రూ.1.93  కోట్లు, హిందూపూర్ లో రూ.1.63 కోట్లు, అమలాపురం (ఎస్సీ) లో రూ.1.52 మరియు నర్సాపురం పి.సి.లో రూ.1.15 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను స్వాదీనం చేసుకోవడం జరిగింది.
Exit mobile version