Home వార్తలు ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిశారని తెలిపారు. మోడీ, చంద్రబాబు సారధ్యంలో అన్ని విధాలుగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.గురువారం విజయవాడ హయత్ ప్యాలెస్ లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….వైకాపా పాలనలో ఇసుక, ల్యాండ్, లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా ఏపీ మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.సిఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన అభివృద్ధి లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి విశాఖ రైల్వే జోన్ ప్రకటించినప్పటకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం వేల కోట్లను ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చిన గృహాలును ప్రజలకు అందించలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవుతారు. 25 ఎంపీ స్థానాలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకే వస్తాయని తెలిపారు.వచ్చే ఐదేళ్లు ఎపి లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో అందరూ‌ చూస్తారు. స్పెషల్ కేటగరీ స్టేటస్ కంటే ఎక్కువ లబ్ధి జరిగింది ఏపీకి జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version