రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్ బ్యాలెట్ ను సమర్పించేందుకు ఈ నెల 22 వరకే చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే గడువు తేదిన ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సిఇఒ ముఖేష్కుమార్ మీనా తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 8లోపు ఓటు హక్కు వినియోగించుకోని వారు తర్వాత ఓటు హక్కును వినియోగించుకునే హక్కు ఉండదని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎక్కడ పనిచేస్తుంటే అక్కడే ఫారం-12ను పూర్తి చేసి, అక్కడే సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఫస్ట్ సెంట్రల్ ఎక్స్ఛేంజ్ను ఈ నెల 28న సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎక్స్ఛేంజ్-2 ఓటు వేయని పోస్టల్ బ్యాలెట్లు మే 3న, మే 8న ఫెసిలిటేషన్ సెంటర్లో సమర్పించాల్సి ఉంటుంది. ఉపయోగించని బ్యాలెట్లు, మిగిలిపోయిన వాటిని మే 10న వెలగపూడిలోని కలెక్టర్ల సమావేశం హాలులో నోడల్ అధికారులకు అప్పజెప్పి రసీదులు తీసుకోవాల్సి ఉంటుందని సిఇఒ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగుల ఆందోళనకు తెరదించిన ఎన్నికల కమిషనర్…పోస్టల్ బ్యాలెట్ పై కీలక ఉత్తర్వులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES