- Advertisement -
AP CM Jagan: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో సీఎం వైఎస్ జగన్ దంపతులు భేటీ అయ్యారు. మార్చి 7వ తేదీ నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల గురించి గవర్నర్ కు సీఎం జగన్ వివరించారు. 7వ తేదీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మార్చి 8న ఇటీవల అకాల మరణం చెందిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి ఉభయ సభల్లో సంతాపం తెలియజేయనున్నారు.
11న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి నెలాఖరు వరకూ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు గవర్నర్ కు సీఎం జగన్ తెలియజేసినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల నిర్వహణతో పాటు వివిధ రాజకీయ అంశాలను కూడా గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం. దాదాపు అరగంట పాటు రాజ్ భవన్ లో సీఎం జగన్ గవర్నర్ తో సమావేశమైయ్యారు.
- Advertisement -