Saturday, May 11, 2024
Home విశ్లేషణ MLA RK Roja: మంత్రి పదవి ఆశిస్తే కార్పోరేషన్ చైర్మన్ గిరీ దిక్కాయే..! ఇప్పుడు అదీ...

MLA RK Roja: మంత్రి పదవి ఆశిస్తే కార్పోరేషన్ చైర్మన్ గిరీ దిక్కాయే..! ఇప్పుడు అదీ పాయె..! మంత్రి పదవి జాబితాలో ఉన్నట్లేనా..!!

- Advertisement -

MLA RK Roja: వైసీపీ ఫెయిర్ బ్రాండ్ మహిళా ఎమ్మెల్యే రోజా తొలి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. సినీ రంగం నుండి  టీడీపీతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన సినీ నటి రోజా ఆ తరువాత వైసీపీలో చేరి సీఎం వైఎస్ జగన్ వద్ద మంచి పరపతి సాధించారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు డిప్యూటి సీఎం నారాయణస్వామితోనూ ఆమెకు విభేదాలు ఉండటంతో పార్టీలో, నియోజకవర్గంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీలోనూ, బయట టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తదితరులపై పంచ్ డైలాగ్ లతో తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ తన మార్కును ప్రదర్శిస్తుంటారు రోజా.

- Advertisement -

రోజాకు తొలి విడతలోనే మంత్రి పదవి వరిస్తుందని ఆమెతో పాటు పార్టీలోనూ చాలా మంది అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణ నేపథ్యంలో సీఎం జగన్మోహనరెడ్డి మంత్రివర్గంలో ఆమెకు స్థానం కల్పించలేకపోయారు. దీంతో ఆమె అలిగారు. అయితే ఆమెకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చినా అయిష్టంగా ఒప్పుకుని స్వీకరించారు. మరో ఆరు నెలల్లో మంత్రివర్గంలో మార్పులు చేయనున్న నేపథ్యంలో ఈ సారి ఛాన్స్ తగలవచ్చేమో అన్న అభిప్రాయంలో ఉన్నారు ఆమె. అప్పటికి మంత్రి పదవి వస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నామినేటెడ్ పదవుల పందేరంలో ఆమె పదవిని వేరే వారికి ఇచ్చేశారు.

- Advertisement -

ఇకపోతే చిత్తూరు జిల్లా నుండి ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఆ జిల్లా నుండి రోజాతో పాటు సీఎం జగన్ కు సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు మంత్రి పదవులపై ఆశతో ఉన్నారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డితో విబేధాలు ఉండటంతో ఆమెకు మంత్రి పదవి అందని ద్రాక్షే అవుతుందా లేక మంత్రి పదవి వరిస్తుందా అన్నది వేచి చూడాలి.  

- Advertisement -
RELATED ARTICLES

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

మేనిఫెస్టో ప్రకటనపై మౌనమేలనోయి.

ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలు అంతిమంగా అధికారమే లక్ష్యంగా పని చేస్తుంటాయి. అందులో భాగంగానే ప్రతి ఐదేళ్లకు జరిగే ఎన్నికలకు తమ పార్టీ విధానాన్ని, చేయబోయే సంక్షేమాన్ని , అభివృద్ధిని...

చీలిక రాజకీయాలు చేసే బిజెపికి చంద్రబాబు చెక్ పెట్టారా ?

దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకున్న పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు టిడిపికి హెచ్చరిక జారీ చేస్తున్నా…రాష్ట్ర ప్రయోజనాలు కోసం బిజెపితో పొత్తు తప్పదని చంద్రబాబు ప్రకటించారు. మరో...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...