Sunday, May 5, 2024
Home వార్తలు Yeluri Sambasivarao: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్వంలో 28న...

Yeluri Sambasivarao: పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్వంలో 28న నిరసన..!!

- Advertisement -

Yeluri Sambasivarao: వైసీపీ ప్రభుత్వ పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆందోళనకు సమాయత్తం అవుతోంది. ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు టీడీపీ  బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను పాల్పడుతూ ప్రజలపై పన్నుల భారం మోపుతుందని విమర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఇంకొల్లు మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు జరిగే నిరసన కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

పన్నుల భారంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఏలూరి అన్నారు. పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏలూరి  ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరల పెంపుతో వ్యవసాయం భారంగా మారిందని అన్నారు. వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మళ్లీ పొయ్యిలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.  డిసెంబర్ 2020లో రూ. 681 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు ఏకంగా రూ.900కు పెరిగిందన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపిందని విమర్శించారు.

- Advertisement -

ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు తక్షణమే చేపట్టాలని ఏలూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతుందని అన్నారు. మద్య నిషేధం అమలు చేస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నాసిరకం మద్యంతో ప్రజలను దోచుకుంటుందని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

Most Popular

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...