Friday, May 10, 2024
Home వార్తలు ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలో మార్పు లేదు’.. వారంలోనే హాల్‌టికెట్లు!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలో మార్పు లేదు’.. వారంలోనే హాల్‌టికెట్లు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1 సర్వీస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు ఉండబోదని ఏపీపీఎస్సీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న మాదిరిగానే మార్చి 17వ తేదీనే పరీక్ష నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్‌ విధానంలో ఓఎమ్మార్‌ షీట్‌ ఆధారిత పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 9 డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు, 18 ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులు, 26 డీఎస్పీ (సివిల్‌) పోస్టులు, 6 రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ పోస్టులు, 5 కోఆపరేటివ్‌ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు, 4 జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి.ఇక 3 జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి పోస్టులు, 1 అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ పోస్టు, 3 అసిస్టెంట్‌ అకౌంట్స్‌ అధికారి పోస్టులు, 2 అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు, 1 జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోస్టు, 1 జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టు, 1 మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ -2 పోస్టు, 1 అసిస్టెంట్ ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు ఉన్నాయి. మార్చి 17న జరిగే ప్రిలిమినరీ పరీక్ష పూర్తిగా అబ్జెక్టివ్‌ ప్రశ్నల రూపంలో ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే మెయిన్స్‌కు అనుమతిస్తారు. మెయిన్‌ పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో జరుగుతుంది. అయితే మెయిన్స్ తేదీని ఏపీపీఎస్సీ ఇంకా ఖరారు చేయలేదు.

ఏపీ టెట్‌ 2024 ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదల.. మార్చి 14న తుది ఫలితాలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు మరో 2 రోజులు అంటే మార్చి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలతోపాటు రెస్పాన్స్‌ షీట్లను కూడా విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు టెట్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీలను, రెస్పాన్స్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అభ్యర్థి ఐడీ, పుట్టినతేదీ, వెరిఫికేషన్‌ కోడ్‌ వివరాలు నమోదు చేసి రెస్పాన్స్‌ షీట్ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమిక ఆన్సర్‌ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఫలితాలు మార్చి 14న విడుదల కానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...