Sunday, April 28, 2024
Home వార్తలు Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

Viveka Murder Case: వివేకా హత్య కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ

- Advertisement -

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై అనుమానితులు ఆరోపణలు చేయడం, ప్రైవేటు కేసు నమోదు కావడం లాంచి చర్యలు నేపథ్యంలో సీబీఐ  అధికారుల దర్యాప్తు ముందడుగులు పడలేదు. కొద్ది రోజులు విరామం ఇచ్చిన సీబీఐ అధికారులు మరల కడపకు చేరుకుని వివేకా ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనాయతుల్లాను వారం రోజుల క్రితం విచారించారు. ఆ తరువాత ఇనాయతుల్లాను అయిదు రోజులుగా తమ వెంటే సీబీఐ అధికారులు ఉంచుకున్నారు.  రెండు సీబీఐ బృందాలు కడప నుండి పులివెందులకు చేరుకుని పలు ప్రదేశాలను పరిశీలించారు. సీబీఐ అధికారి అంకిత్ యుదవ్ ఆధ్వర్యంలో అధికారుల బృందాలు వివేకా నివాసంతో పాటు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాలను పరిశీంచాయి.

- Advertisement -

ఇనాయతుల్లాతో పాటు పాటు రెవెన్యూ సర్వేయర్ ను కూడా సీబీఐ అధికారులు వెంట బెట్టుకుని పులివెందులలోని పలు ప్రదేశాలను పరిశీలించి అక్కడ స్థలాల్లో కొలతలు తీస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజున బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న వివేకా మృతదేహాన్ని ముందుగా ఇనాయుతుల్లానే ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ ఫోటోలు, వీడియోలు ఇనాయతుల్లా ఎవరెవరికి పంపాడు అనే విషయాల ఆధారంగా కూడా సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తొంది.

- Advertisement -

వివేకా హత్య కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మూడవ నిందితుడు దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...