- Advertisement -
AP Govt: ఏపి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాధారణ బదిలీలపై నిషేదం ఎత్తివేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుండి 17వ తేదీ వరకూ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయిదేళ్లు పైబడి ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు.
- Advertisement -
వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం అధారంగా బదిలీలను చేపడుతున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రెండేళ్లుగా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఉద్యోగుల పరిస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ నుండి బదిలీపై బ్యాన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
- Advertisement -