రానున్న ఎన్నికల్లో కాపు వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే నిలబడతరా? కాపులకు అన్యాయం జరిగినా ఇది ఏమిటని ప్రశ్నించని జక్కంపూడి రాజాకే మద్దతుగా ఉంటారా? దళితులకు శిరోమండనం చేసిన తోట త్రిమూర్తులకు అండగా ఉంటారా? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీయే కూటమికి మద్దతుగా ఉంటారా? మీరే నిర్ణయం తీసుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన వారాహి విజయ యాత్ర సభలో ఆయన మాట్లాడారు. కాపు రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేశారో సిఎం జగన్..కాపు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.65 లక్షల మందికి కాపు నేస్తం అందాల్సి ఉండగా …కేవలం 2.35 లక్షల మందికే ఇస్తున్నారని మండిపడ్డారు.
వైసిపి రహిత రాష్ట్రం కోసమే కూటమి
మళ్ళీ వైసిపి ప్రభుత్వం వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది అనే ఆలోచనతోనే మొదటి నుంచి కూటమి కోసం ప్రయత్నం చేసాను.జనసేన ఓటింగ్ శాతం పెరిగిన కూడా ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చిలకూడదన్న ఉద్దేశంతోనే ఎన్నికలకు వెళ్తున్నాం అని తెలిపారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా పురంధేశ్వరిని..రాజానగరం అసెంబ్లీ అభ్యర్థిగా బలరాం కృష్ణమూర్తిని గెలిపించాలని కోరారు. తనను జగన్ వ్యక్తిగతంగా విమర్శించినా కోపం రాదు ….కానీ దళిత డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెల్వరీ చేస్తే కోపం వస్తుంది.అణగారిన వర్గాలకు అన్యాయం చేస్తే కోపం వస్తుందని తెలిపారు.
పోలవరం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాము
పోలవరంను వైసిపి ప్రభుత్వం ఏటిఏం వలే వాడుకుందని సాక్షాత్తు కేంద్ర జల శాఖ మంత్రి గజేంద్ర షేకావత్ చెప్పారని గుర్తు చేశారు.పోలవరం పూర్తి చేసే బాధ్యతను ఎన్డీయే తీసుకుంటుందని హామీ ఇచ్చారు.గంగా నది ప్రక్షాళన మాదిరి గోదావరి ప్రక్షాలనకు మోదీ సహకారం తీసుకుంటామని తెలిపారు.రాష్ట్రంలో యువశక్తి లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి 2047 నాటికి దేశానికి వెన్నుముకుగా తయారు చేస్తాం అని హామీ ఇచ్చారు.