Home వార్తలు Ysrcp: వైసీపీలో.. ఆ నలుగురికీ ఖరారు..!?

Ysrcp: వైసీపీలో.. ఆ నలుగురికీ ఖరారు..!?

Ysrcp: జిల్లాలో కొద్ది కాలంగా వైసీపీలో అంతర్గతంగా నలుగుతున్న ఓ చర్చకు పార్టీ పెద్దలు తెరదించారు. జిల్లాలోని అద్దంకి, చీరాల, పర్చూరు, కొండపి నియోజకవర్గాలకు ఎవరు పూర్తిస్థాయి ఇంచార్జి, ఎవరు పోటీ చేయనున్నారు అనే సందేహాలకు సమాధానమిచ్చారు. దాదాపు ఆ నాలుగు స్థానాలకు ఇంఛార్జీలను ఖరారు చేసారు.

  • చీరాల నియోజకవర్గంలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం ఎమ్మెల్యే కరణం బలరాం ఆధ్వర్యంలో జరగాలని పార్టీ నిర్ణయించింది. అయితే కరణం అధికారికంగా పార్టీలో చేరకపోవడంతో వెంకటేష్ ఈ మేరకు నిర్వహించనున్నారు. బలరాం అదే కార్యక్రమంలో ఉన్నప్పటికీ.., అధికారిక పర్యటనలు పేరిట పార్టీ, ప్రభుత్వ ప్రతినిధిగా చేయనున్నట్టు తెలుస్తుంది..! ఈ నియోజకవర్గం విషయంలో పార్టీ చాలా తర్జనభర్జనలు పడినట్టు తెలుస్తుంది. ముందుగా ఆమంచికి ఇంఛార్జి హోదాలో గడప గడపకు కార్యక్రమం నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. కానీ ఒక్కరోజులో ఈ నిర్ణయంలో మార్పు వచ్చింది. పార్టీ కార్యక్రమాలు ఇకపై కరణం నిర్వహించాలని పార్టీ దాదాపు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం..!!
  • పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జిగా గాదె వెంకటరెడ్డి కుమారుడు మధుసూధన్ రెడ్డిని ఖరారు చేసినట్టు సమాచారం. ఆయనే ఈ గడప గడపకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది..! ఈ తండ్రీకొడుకులు రేపు వెళ్లి సీఎంని కలవనున్నట్టు తెలుస్తుంది..!
  • అద్దంకి నియోజకవర్గం ఇంచార్జిగా ప్రస్తుతం ఉన్న బాచిన కృష్ణ చైతన్యకు లైన్ క్లియర్ చేశారు. ఆయనే పార్టీ కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్వహించనున్నారు.
  • ఇక కొండపి నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న వెంకయ్య స్థానంలో వరికూటి అశోక్ బాబుని ఖరారు చేసినట్టు సమాచారం.

ఈ మేరకు దీనిపై అధికారికంగా ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.

Exit mobile version