Home వార్తలు నేటి నుండి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

నేటి నుండి ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుండి మూడు రోజుల పాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆయన రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో మకాం వేయనున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికలను టార్గెట్ గా చేసుకుని నిర్వహించే కార్యక్రామలు, నియోజకవర్గ స్థాయి నాయకుల పనితీరు, ఆశావహులకు బాబు భరోసా వంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని నేతలు అంటున్నారు. ఇవేళ కడప జిల్లా బద్వేల్ లో కార్యక్రమం ముగిసిన తర్వాత చంద్రబాబు గిద్దలూరుకు చేరుకుంటారు.

గిద్దలూరులో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. గిద్దలూరు గాంధీ బొమ్మ సెంటర్ నుండి రాచర్ల గేట్, ఆర్టీసి డీపో మీదుగా వినూత్న విద్యానికేతన్ వరకూ రోడ్ , నిర్వహిస్తారు. అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. రేపు (20వ తేదీ) మార్కాపురంలో చంద్రబాబు తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటారు. సాయంత్రం కంభం రోడ్డు జంక్షన్ నుండి చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. క్లాక్ టవర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, ఎస్కేవీపీ కాలేజీ వరకూ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. 21వ తేదీ (ఎల్లుండి) యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. సాయంత్రం రాళ్ల వాగు వరకూ రోడ్ షో నిర్వహించి అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో గిద్దలూరుకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు.

Exit mobile version