Home వార్తలు MP Magunta: వైసీపీ పార్లమెంటరీ భేటీలో ఒంగోలు ఎంపీ మాగుంట..!!

MP Magunta: వైసీపీ పార్లమెంటరీ భేటీలో ఒంగోలు ఎంపీ మాగుంట..!!

MP Magunta: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గురువారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాసులుతో సహా పలువురు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ నుండి జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యహంపై జగన్మోహనరెడ్డి పార్లమెంట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, ప్రత్యేక హోదా, కృష్ణా జలాల వివాదం, పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల తదితర అంశాలను ప్రస్తావింటే అంశాలపై ఎజెండాను ఖరారు చేశారు.

ycp parliamentary party meeting

అదే విధంగా నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ పై స్పీకర్ పై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకూ జరగనున్నాయి.

Exit mobile version