Friday, May 3, 2024
Home వార్తలు ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

- Advertisement -

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతున్నామని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి డా”నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. మంగళవారం గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో జరిగిన ఓటర్ల చైతన్య లఘు చిత్రాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు మరియు శ్రీకారం కళాపరిషత్ లు ఓటర్లను చైతన్యపరచడానికి రూపొందించిన ఐదు లఘు చిత్రాలను డా”నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆవిష్కరించారు. సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ….రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తరఫున ఎన్నికల నిఘాలో భాగంగా పరిశీలకులు మే 9వ తేదీ నుండి క్షేత్రస్థాయిలో పనిచేస్తారని తెలిపారు. లఘు చిత్రాలను రూపొందించిన కందిమళ్ళ సాంబశివరావు, జాష్టి అనురాధ, జె.వి.మోహన్ రావు, యస్.జయరావు, టి. సాంబశివరావు, యం. కోటేశ్వరరావు ల బృందాన్ని అభినందించి సత్కరించారు. లఘు చిత్రాల ద్వారా ఓటర్ల ఆలోచనలో, వారి భావాల్లో పెను మార్పులు తీసుకురావచ్చునని ఆలోచింపజేసేవిగా ఉన్నాయని కొనియాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి ఫలితంగా వాలంటీర్లను ఎన్నికల విధుల నుండి దూరం చేయగలిగామని రాజకీయ అబ్ధికోసం వాలంటీర్లను ఉపయోగించుకోవడాన్ని అడ్డుకట్ట వేయగలిగామన్నారు. మే 1,2 తేదీలలో పెన్షన్ దారులకు వారి ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కృషి చేయాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో జరిగిన విధంగా వృద్ధులని ఇబ్బందిపాలు చేయవద్దని హితవు పలికారు. గ్రామ-వార్డు సచివాలయ సిబ్బందిని, పంచాయితీ సిబ్బందిని, ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకుని వృద్ధుల ఇళ్ల వద్దనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ : లక్ష్మణ రెడ్డి

- Advertisement -

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ…. లఘు చిత్రాలు సందేశాత్మకంగా ఉన్నాయని ఓటు అమ్ముకోవద్దని, విద్యావంతులు తప్పకుండా ఓటింగ్ లో పాల్గొనాలని , మంచి పరిపాలన అభివృద్ధికి తోడ్పడే అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఆలోచనలను లఘు చిత్రాలు అందించాయన్నారు. ప్రభుత్వాలు సంపద సృష్టికి తోడ్పడుతూ సమాజాన్ని అభివృద్ధి వైపు పురోగమించేటట్లు పనిచేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33% ఆంధ్రప్రదేశ్ లో రుణాలు ఉండటం 14 లక్షల కోట్లకు చేరి అప్పుల ఊబిలో ఉందని విమర్శించారు. 25% నిరుద్యోగం కొనసాగుతుందని అక్షరాస్యతలో మూడవ స్థానంలో ఉన్నామని ఈ పరిస్థితిలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకుని వెళ్లే అభ్యర్థులను ఎన్నుకోవాలని కులము,మతము, డబ్బులు, మద్యం లాంటి ప్రలోభాలకు లోను కావద్దని కోరారు.ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రంగయ్య, పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితి కన్వీనర్ పి.వి. మల్లిఖార్జునరావు, ప్రముఖ ఇంజనీర్ కుర్రి రామ సుబ్బారావు, సూర్య ఇన్వెస్టిగేషన్ వ్యవస్థాపకులు కాళహస్తి సత్యనారాయణ, తెలుగు భాషోద్యమ సమాఖ్య కన్వీనర్ డా” వి. సింగారావు, ప్రముఖ రంగస్థలం నటుడు నాయుడు గోపి, ప్రముఖ న్యాయవాది చిగురుపాటి రవీంద్రబాబు, ప్రముఖ దర్శకుడు చిట్టినేని శివ కోటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....