Tuesday, April 30, 2024
Home వార్తలు తాగునీరు, ఉపాధి హామీ ,విద్యుత్ సరఫరా అంశాలపై సిఎస్ కీలక ఆదేశాలు

తాగునీరు, ఉపాధి హామీ ,విద్యుత్ సరఫరా అంశాలపై సిఎస్ కీలక ఆదేశాలు

- Advertisement -

రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్, మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి తాగునీరు,ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై సంబంధిత శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సిఎ‌స్ మాట్లాడుతూ… తాగునీటి ఎద్దడి గల ఆవాసాలకు జూన్ నెలాఖరు వరకు ట్యాంకులు ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఇంకా రెండు జిల్లాల నుండి ప్రతి పాదనలను రావాల్సి ఉందని అవి వస్తే రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో తగిన అనుమతులు జారీ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపండి

- Advertisement -

నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ నుండి తాగునీటి అవసరాలకై పల్నాడు,ప్రకాశం, గుంటూరు,బాపట్ల జిల్లాల్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపేందుకు ఈనెల 8నుండి నీటిని విడుదల చేయడం జరిగిందని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.అలాగే ప్రకాశం బ్యారేజి నుండి ఎన్టిఆర్,కృష్ణా, ఏలూరు,బాపట్ల జిల్లాలకు కాలువల ద్వారా ఈనెల 6 నుండి నీటిని విడుదల చేశామని తెలిపారు.కావున వెంటనే అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని సిఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈవేసవిలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలో 1669 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను 101 కోట్ల రూ.లతో మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగిందని అపనులు వారం రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- Advertisement -

వాటర్ కన్జర్వేషన్ పనులను వెంటనే మొదలు పెట్టండి

- Advertisement -

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు కల్పనపై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షిస్తూ ఈ పధకం కింద ప్రతిపాదించిన వాటర్ కన్జర్వేషన్ పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు.గత మూడు రోజుల్లో ఉపాది హామీ రోజువారీ పనులు 11లక్షల నుండి 22 లక్షల పని దినాలకు పెరగడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.ఉపాది హామీ పనులు కల్పనలో శ్రీకాకుళం,విజయనగరం జిల్లా లు ముందంజలో ఉండడం పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు

రాష్ట్రంలో వేసవి దృష్ట్యా ఎక్కడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.ఈసందర్భంగా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రానున్న రోజుల్లోను డిమాండ్ కు సరిపడా విద్యుత్ సరఫరాకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర జలవనరులు, పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ కె.కన్నబాబు, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం ఇఎన్సి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా సిడిఎంఏ శ్రీకేశ్ బాలాజీ రావు,జల వనరుల శాఖ ఇఎన్సి నారాయణ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

Most Popular

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...

తనిఖీల పేరుతో ఇబ్బందులు కలిగించవద్దు : రామ్ మోహన్ మిశ్రా

ఓటర్లను ప్రలోభపెట్టేలా తరలించే డబ్బును కట్టడి చేయడంపై మరింత దృష్టి పెట్టాలని ఎన్నికల స్పెషల్ జనరల్ అబ్జర్వరు రామ్ మోహన్ మిశ్రా తెలిపారు. అదే సమయంలో తనిఖీల పేరుతో సామాన్య...

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...