Home వార్తలు టిడిపి లో చేరికకు సంసిద్ధం : మాగుంట

టిడిపి లో చేరికకు సంసిద్ధం : మాగుంట

తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తమ కుటుంబం సంసిద్ధంగా ఉందని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఒంగోలు లోని మాగుంట నివాసంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ….టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.అతి త్వరలోనే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. ముప్పై ఏండ్లుగా ప్రకాశం ప్రజలు తమ కుటుంబాన్ని ఆశీర్వదించారు. మాగుంట సుబ్బరామిరెడ్డి,మాగుంట పార్వతమ్మ జిల్లా ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు.తన తనయుడు మాగుంట రాఘవరెడ్డి తెలుగుదేశం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు ను కోరారు. రానున్న ఎన్నికల్లో మాగుంట రాఘవ రెడ్డిని జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్, ఎస్.ఎన్.పాడు ఇంఛార్జి బి.ఎన్.విజయ్ కుమార్, దామచర్ల సత్య, కందుకూరు ఇంఛార్జి ఇంటూరి నాగేశ్వరావు , యర్రగొండపాలెం ఇంఛార్జి ఎరిక్షన్ బాబు, మార్కాపురం ఇంఛార్జి కందుల నారాయణరెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, హర్షిని సంస్థల అధినేత రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.