Saturday, April 27, 2024
Home వార్తలు పీఎస్ లోనే వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు ..రిమాండ్ తరలింపుకు సన్నాహాలు.. ఇంటి వద్ద విజయమ్మ...

పీఎస్ లోనే వైఎస్ షర్మిలకు వైద్య పరీక్షలు ..రిమాండ్ తరలింపుకు సన్నాహాలు.. ఇంటి వద్ద విజయమ్మ నిరసన

- Advertisement -

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. ప్రగతి భవన్ ముట్టడికి పిలుపును ఇచ్చి నిన్న ద్వంసమైన కారులోనే బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కారు నుండి దిగకపోవడంతో క్రేన్ సాయంతోనే ఆమెతో సహా కారును ఎస్ఆర్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. ఆమె పై పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షర్మిలను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను పోలీసు స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. విషయం తెలియడంతో షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అంటూ బ్రదర్ అనిల్ మండిపడ్డారు.

మరో పక్క షర్మిల అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. షర్మిలతో పాటు మరో అయిదురు వైఎస్ఆర్ టీపీ నాయకులను రిమాండ్ కు తరలించేందుకు పోలీసులు సన్నాహాలు చేశారు. పీఎస్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్ పేట వైద్యలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్ది సేపటిలో షర్మిలతో సహా ఆ పార్టీ నేతలను మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హజరు పర్చనున్నారు. కాగా షర్మిలను కలిసేందుకు ఆమె తల్లి, దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ లోటస్ పాండ్ నుండి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టు చేశారు. పోలీస్ అధికారులతో విజయమ్మ వాదనకు దిగారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ విజయమ్మ తన ఇంటి గేటు వద్దే భైటాయించారు. తన కుమార్తెను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారనీ, తన కుమార్తెను చూసేందుకు వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికే తీసుకువస్తామని పోలీసులు చెబుతున్నారనీ, ఇంటికి తీసుకువచ్చే వరకూ గేటు వద్దే కూర్చుంటానని తెలిపారు.

- Advertisement -

షర్మిల ఎక్కడా పరుష పదజాలం వాడలేదనీ, విమర్శిస్తే సమాధానం చెప్పాలి కానీ దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని విజయమ్మ అన్నారు. ప్రజల నుండి షర్మిలను ఎవరూ వేరు చేయ్యలేరని అన్నారు. ఆడబిడ్డపై దాడి జరిగినప్పుడు ప్రతి నాయకుడు స్పందిస్తారని అన్నారు. మరో పక్క షర్మిల అరెస్టుపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల పట్ల జరిగిన ఘటన వ్యక్తిగతంగా బాధకల్గించే అంశమని అన్నారు. ఇదిలా ఉంటే షర్మిల పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నిన్న వరంగల్లు జిల్లాలో పాదయాత్ర చేస్తుండగా పోలీసులు నిలువరించారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ పంపించారు. దీంతో ఈ రోజు వైఎస్ఆర్ టీపీ తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన కోర్టు పలు ఆంక్షలతో పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయవద్దని ఆదేశించింది.

- Advertisement -
RELATED ARTICLES

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

Most Popular

అసెంబ్లీ కు 2705, పార్లమెంట్ కు 503 నామినేషన్లు ఆమోదం : ముఖేష్ కుమార్ మీనా

ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో 25 పార్లమెంట్ స్థానాలకు 686 నామినేషన్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 3,644 నామినేషన్లు దాఖలు అయినట్టు...

పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి : ఏపిజేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల విధులలో వున్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకునేలా జిల్లాల ఎన్నికల అధికారులును సీఈఓ ఆదేశించాలని ఏపిజేఏసీ అమరావతి కమిటీ కోరింది. శనివారం ఏపిజేఏసీ అమరావతి స్టేట్...

ఇళ్ల వద్దనే పెన్షన్ అందించేలా ఆదేశాలు ఇవ్వండి : జన చైతన్య వేదిక

రాష్ట్రంలో ఫించన్ ధారులకు మే 1,2వ తేదీల లోనే వారి వారి ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి...

అధికార మధంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ …..ఓటు ద్వారానే జగన్ కు బుద్ధి చెప్పాలి : దేవినేని ఉమా

రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబర్ లో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా పౌరుల ఆస్తి హక్కులను పూర్తిగా తన గుప్పిట్లోకి తీసుకుంటుందని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు దేవినేని...