Monday, April 29, 2024
Home వార్తలు పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

- Advertisement -

పల్నాడు జిల్లాలోని వంకాయలపాడు లో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐటీసీ గ్లోబల్ స్పెసెస్ యూనిట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ యూనిట్ లో 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఈ యూనిట్ వల్ల వేల మంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పారు. రెండవ దశ పూర్తి అయితే అతి పెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన రాష్ట్రంలోనే ఉంటుందన్నారు. 24 నెలల్లో ఈ యూనిట్ ను ఐటీసీ పూర్తి చేసిందన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని స్పెసిస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలోనే ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.3450 కోట్లతో ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ యూనిట్ల ద్వారా 33వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో పది యూనిట్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయని తెలిపారు. వీటి వల్ల రైతుల పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తదుపరి సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్య కళాశాలకు చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు విడతల రజిని, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...