Home వార్తలు పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

పల్నాడు జిల్లాలోని వంకాయలపాడు లో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐటీసీ గ్లోబల్ స్పెసెస్ యూనిట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ యూనిట్ లో 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఈ యూనిట్ వల్ల వేల మంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పారు. రెండవ దశ పూర్తి అయితే అతి పెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన రాష్ట్రంలోనే ఉంటుందన్నారు. 24 నెలల్లో ఈ యూనిట్ ను ఐటీసీ పూర్తి చేసిందన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని స్పెసిస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలోనే ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.3450 కోట్లతో ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ యూనిట్ల ద్వారా 33వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో పది యూనిట్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయని తెలిపారు. వీటి వల్ల రైతుల పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తదుపరి సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్య కళాశాలకు చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు విడతల రజిని, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version