Sunday, April 28, 2024
Home వార్తలు Pawan Kalyan: జనసంద్రమైన పర్చూరు .. పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం

Pawan Kalyan: జనసంద్రమైన పర్చూరు .. పవన్ కళ్యాణ్ కు ఘనస్వాగతం

- Advertisement -

Pawan Kalyan: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరుకి విచ్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభిమానులు, కార్యకర్తల నుండి ఘన స్వాగతం లభించింది. బాధిత కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష వంతున ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా వారి కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అందించారు పవన్ కళ్యాణ్. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గంగా వచ్చిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా జనసైనికులు, అభిమానులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దసరా వరకూ వైసీపీ వాళ్లు ఏమి మాట్లాడినా భరిస్తామనీ, అప్పటి నుండి ప్రజల్లోనే ఉండి వాళ్ల సంగతి చూస్తామని అన్నారు పవన్ కళ్యాణ్. పొత్తుల గురించి మాట్లాడే సమయం ఇది కాదనీ, పాత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదని స్పష్టం చేసారు. 2024 లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారన్నారు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికే మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం రూ.5కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పు ఏమి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నించాలన్నారు. 2014 లో తాను పోటీకి దిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని పవన్ అన్నారు.

- Advertisement -

వైసీపీ నాయకులు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని పవన్ విమర్శించారు. బాధ్యతలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నారు. నిరుద్యోగులకు జనసేన అధికారంలోకి వస్తే జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, రైతు ప్రయోజనాలు కాపాడతామని హామీ ఇచ్చారు. చాలా సార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్.

- Advertisement -
RELATED ARTICLES

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

Most Popular

అంబేద్కర్ బ్రతికుంటే బ్రాహ్మణులకు రిజర్వేషన్ కల్పించేవారు : నాగబాబు

రాచరిక వ్యవస్థలో పూర్వికులు చేసిన తప్పుకి నేటి తరం బ్రాహ్మణ్యం అవమానాలు అష్ట కష్టాలు పడుతోందని జనసేన పార్టీ నాయకులు నాగబాబు అన్నారు. ప్రస్తుతం బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అంబేద్కర్...

పథకాలు కాదు….భారాలు ఎంత మోపుతారో చెప్పండి : వి.శ్రీనివాసరావు

సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పోటీపడి హామీలు ప్రకటిస్తున్న వైసిపి టిడిపిలు…. అధికారంలోకి వస్తే ప్రజల నుంచి పన్నులు, ధరలును పెంచి ఎంత వసూలు చేస్తారో కూడా సమాధానం చెప్పాలని...

స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చి… ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుతారు జగన్ ? : సయ్యద్ రఫీ

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షిస్తారని టీడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర...

ఆరు రోజుల్లోనే పొన్నవోలుకు పదవి ఎలా కట్టబెట్టారు ? : షర్మిల

వైసిపి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే పొన్నావోలు సుధాకర్ రెడ్డికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎలా కట్టబెట్టారు ? తండ్రి పేరును చార్జ్‌షీట్‌లో చేర్చిన వ్యక్తికి పదవి ఎందుకిచ్చారని...