Home Uncategorized కేశినేని నాని బలం ఏమిటో జగన్ కు అర్థం అయ్యింది : బుద్ధా వెంకన్న

కేశినేని నాని బలం ఏమిటో జగన్ కు అర్థం అయ్యింది : బుద్ధా వెంకన్న

ఎవరైనా పార్టీ మారేటప్పుడు తమ బలాన్ని,బలగాన్ని వారి అధినేత వద్ద చూపించే ప్రయత్నం చేస్తారు..కానీ కేశినేని నాని టిడిపి నుంచి వైసిపికి వెళ్తూ ఒక్క నాయకుడ్ని కూడా తిసుకువేళ్ల లేకపోయారని టీడిపి నేత బుద్ధా వెంకన్న తెలిపారు.శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ …కేశినేని నాని వైసిపి లో చేరిన పది రోజుల్లోనే.. విజయవాడ పార్లమెంట్ పరిధిలో మైలవరం నియోజవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కి వచ్చారని పేర్కొన్నారు. నాని బలం ఏమిటో జగన్ కు ఇప్పటికీ అర్థం అయ్యి ఉంటుందని…ఆయనకు వైసిపి నుంచి టికెట్ వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పారు. తన గెలుపు వలనే గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే గా గెలిచారని చెప్పుకుంటున్న నాని వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నాని తన పార్లమెంట్ లో 8,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందితే…విజయవాడ తూర్పు లో గద్దె రామ్మోహన్ 17, 000 ఓట్లతో గెలుపొందారని.. గద్దె రామ్మోహన్ విజయం వలనే కేశినేని నాని లబ్ధి పొందారు అని వెల్లడించారు. చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటున్నారని నాని చేసిన వ్యాఖ్యల పై విరుచుకుపడ్డారు. తనకు ఉన్న అవ లక్షణాలును అన్నీ ఎదుటివారి మీద రుద్దే వ్యక్తి కేశినేని నాని అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.వైసీపీలో నాని అనే వ్యక్తి బరువే తప్ప…ఇసుమంత లాభం లేకపోగా.. చివరకి ఆయన పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు గా పోటీ చేయటం ఇష్టం లేక అభ్యర్థులు పారిపోతున్నారు అని ఎద్దేవా చేశారు. నాని ఈర్ష్య స్వబావం కలిగిన వ్యక్తి…కేశినేని చిన్ని పార్టీ కార్యక్రమంలో పాల్గొని పనులు చేస్తుంటే తట్టుకోలేరని మండిపడ్డారు. సొంత మరదలు పై స్టికర్ కేస్ ఎవరైనా పెడతారా అని ప్రశ్నించారు.కేశినేని నాని కుటుంబ సభ్యులే ఆయన వెంట లేరని వెల్లడించారు.

Exit mobile version