Home వార్తలు విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది. ఈత సరదా తీర్చుకోవడం కోసం సముద్రంలోకి దిగిన విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన విశాఖ భీమిలి బీచ్ లో శుక్రవారం జరిగింది. తగరపువలస అనిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అయిదుగురు విద్యార్ధులు శుక్రవారం భీమిలి బీచ్ కు వెళ్లారు. ఈత సరదా తీర్చుకునేందుకు సముద్రంలోకి దిగారు. ఆలలు ఎగిసిపడటంతో సూర్య, సాయి అనే విద్యార్ధులు గల్లంతు అయ్యారు. మరో ముగ్గురు విద్యార్ధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

బీచ్ వద్ద పోలీసులు తొలుత గజ ఈతగాళ్లతో గల్లంతైన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది హెలికాఫ్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్ధుల తల్లిదండ్రులు బీచ్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Exit mobile version