Saturday, April 20, 2024
Home వార్తలు ఐటీ అధికారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

ఐటీ అధికారికి తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్

- Advertisement -

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బందువుల ఐటీ శాఖ అధికారులు రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో కోట్లాది రూపాయల నగదు, ఆభరణాలు, విలువైన పత్రాలు సీజ్ చేశారు. అయితే విధి నిర్వహణలో ఉన్న తమపై మంత్రి మల్లారెడ్డి తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేసి ల్యాప్ ట్యాప్, ఇతర పత్రాలు లాక్కున్నారనీ ఐటీ అధికారి రత్నాకర్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

మరో పక్క మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి.. ఆసుపత్రిలో ఉన్న తన సోదరుడు మహేందర్ రెడ్డిని బెదిరించి దౌర్జన్యంగా ఐటీ అధికారి రత్నాకర్ సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులపై బోయినపల్లి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దుందిగల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ అధికారి రత్నాకర్ .. మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రత్నాకర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధించింది. నాలుగు వారాల పాటు దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

Most Popular

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...