Wednesday, April 24, 2024
Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు

- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది. ఇప్పటికే ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్. సింహాయాజీలను విచారించిన సిట్ అధికారులు ఈ కేసులో అనుమానితులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు ఒక బృందం కేరళ రాష్ట్రంలో గాలింపు చర్యలు చేపడుతోంది. అనుమానితుల్లో కొందరిని విచారణకు హజరుకావాలని సిట్ నోటీసులు జారీ చేస్తొంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడైన బూసారపు శ్రీనివాస్ కు సిట్ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 21వ తేదీ 10.30 గంటలకు విచారణకు హజరుకావాలని 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, సింహయాజీలకు బూసారపు శ్రీనివాస్ విమాన టికెట్లు బుక్ చేశారన్న ఆరోపణలు రావడంతో అధికారులు ఆయనను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఇదే కేసులో కేరళకు చెందిన ఎన్డీఏ నాయకుడు తుషార్ కు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయనను 21వ తేదీ విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడైన రామచంద్రభారతి, ఫిర్యాదిదారుడైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలతో తుషార్ ఫోన్ లో మాట్లాడినట్లుగా అధికారులు గుర్తించారు.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

Most Popular

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...