Prakasam Tdp Mlas:తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడితో ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె, అద్దంకి, కొండేపి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, డా శ్రీడోల బాల వీరాంజనేయ స్వామి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిలిచిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంలో ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పై టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన కృషిని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు.