Friday, April 19, 2024
Home వార్తలు Prakasam News: రాములోరికి కోపం వచ్చిందంట..? మునగపాడు గ్రామస్తుల ఆందోళన..?

Prakasam News: రాములోరికి కోపం వచ్చిందంట..? మునగపాడు గ్రామస్తుల ఆందోళన..?

- Advertisement -


Prakasam News: వేప చెట్టుకు పాలు కారుతున్నాయనీ, వినాయకుడు పాలు తాగుతున్నాడనీ, సాయి బాబా విగ్రహం నుండి వీపూధి పడుతోందనీ ఇలా అనేక ఘటనలు గ్రామాల్లో ప్రచారం జరగడం చూశాం. తాజాగా ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం మునగపాడు గ్రామంలో అటువంటి చిత్రమైన ఘటనే చోటుచేసుకుంది. గ్రామంలోని రామాలయంలో సీతారాముల విగ్రహం కళ్ల నుండి నీరు కారుతుండటం ఆశ్చర్యాన్ని కల్గించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చుట్టుపక్కల గ్రామాలకూ పాకింది. దీంతో ఈ వింతను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఆలయానికి బారులు తీరారు. అయితే దీనిపై ఆలయ పూజారి స్పందించారు. ఇటీవల తాను విగ్రహాలు శుభ్రపరిచే సమయంలో చింతపండు వాడాననీ, అందువల్ల నీరు కారుతున్నాయేమోనని సందేహం వ్యక్తం చేశారు.

అయితే గ్రామస్తులు మాత్రం ఇది ఓ సంకేతంగా చెబుతున్నారు. గత రెండేళ్లుగా ఈ రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం లేదనీ, అందుకే రాములోరికి కోపం వచ్చిందేమోనని సందేహ పడుతున్నారు. అందుకే విగ్రహం కళ్ల వెంట నీళ్లు వస్తున్నాయని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇది చెడు సంకేతంగా వారు ఆందోళన చెందుతున్నారు. స్వామివారిని శాంతింపజేసేందుకు ఉత్సవాలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. శాస్త్ర సాంకేతికంగా మానవులు ముందుకు సాగుతున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, మూడ భక్తి ఇంకా కొనసాగుతున్నాయి అనడానికి ఇదీ ఓ ఉదాహరణగా నిలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

Most Popular

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...