Wednesday, April 24, 2024
Home వార్తలు MLA Gottipati: 11న అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన

MLA Gottipati: 11న అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన

- Advertisement -


MLA Gottipati: ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని సంఘటితం గా నిలదీయాలని టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన సంతమాగులూరు మండలం అడవిపాలెం పర్యటనలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలు అధికంగా వస్తున్న కరెంటు బిల్లుల గురించి, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

Gottipati Ravikumar: Straight Questions to CM and DGp

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్లలో ఆరు సార్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు బిగించారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీల పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని అన్నారు.

- Advertisement -

విద్యుత్ వినియోగదారులు కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో ట్రూ ఆఫ్ చార్జీలను తాత్కాలికంగా నిలిపివేశారని చెప్పారు. ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెంచడంతో రైతుల కష్టాలు అధికం అయ్యాయన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడాన్ని రైతులు 90 శాతం మేర అంగీకరించారని వైసీపీ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఈ సమస్యలకు నిరసనగా ఈనెల 11న అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా మండల విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే రవికుమార్ పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

Most Popular

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...

ఓట్లు కొల్లగొట్టడానికే ఉక్కు కార్మికులతో సిఎం చర్చలు : వి. శ్రీనివాసరావు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై రెండేళ్లు మౌనం వహించి ఎన్నికల వేళ కార్మికులకు అండగా ఉంటానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లోపాయికారిగా చెప్పడం మోసకారితనమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.బుధవారం విజయవాడ...

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...