Home వార్తలు KCR: డోంట్ ఫియర్ ఐ యాం హియర్ .. ధాన్యం రైతాంగానికి కేసిఆర్ భరోసా ప్రకటన

KCR: డోంట్ ఫియర్ ఐ యాం హియర్ .. ధాన్యం రైతాంగానికి కేసిఆర్ భరోసా ప్రకటన

KCR: యాసంగి ధాన్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో దిగుబడి వచ్చిన మొత్తం ధాన్యం కొంటామని తెలిపారు. క్వింటాల్ రూ.1960లు చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందనీ, ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మూడు, నాలుగు రోజుల్లోనే కొనుగోలు పూర్తి చేస్తామని చెప్పారు. రేపటి నుండి యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని వెల్లడించారు కేసిఆర్. రైతులు తక్కువ ధరలకు ధాన్యం విక్రయించుకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మంగళవారం జరిగిన కేబినెట్ లో ధాన్యం కొనుగోలుపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. 

గత కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది.  బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన నిన్న కార్యక్రమాన్ని నిర్వహించారు.  సీఎం కేసిఆర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ వడ్లు మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్న కారణంగా తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. కేబినెట్ భేటీ అనంతరం కేసిఆర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Exit mobile version