Tuesday, April 23, 2024
Home వార్తలు Honour Murder: తెలంగాణలో మరో పరువు హత్య.. స్తంభానికి కట్టేసి తలలో మేకులు దింపి మరీ..

Honour Murder: తెలంగాణలో మరో పరువు హత్య.. స్తంభానికి కట్టేసి తలలో మేకులు దింపి మరీ..

- Advertisement -

Honour Murder in Telangana: తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో జరిగిన ప్రణయ్ పరువు హత్య అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అమృత ప్రేమించిన యువకుడు ప్రణయ్ పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో కుటుంబ పరువు పోయినట్లుగా భావించిన అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతక ముఠాతో అల్లుడిని దారుణంగా హత్య చేయించడం, ఆ తరువాత కొన్ని నెలలకు మనోవేదనతో మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఇలాంటి ఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలో మరో పరువు హత్య జరగడం తీవ్ర సంచలనాన్ని రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న అల్లుడిని మామ కిరాయి హంతముఠాతో చంపించిన తీరు తీవ్రంగా కలచివేస్తుంది.

Honour Murder in Telangana: సామాజికవర్గం వేరు కావడంతో

- Advertisement -

వివరాల్లోకి వెళితే…యాదాద్రి భువనగిరి జిల్లా లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ హోంగార్డుగా పని చేస్తున్న సమయంలో యాదాద్రికి చెందిన భార్గవి అనే యువతిని ప్రేమించుకున్నారు. భార్గవి ముదిరాజ్ సామాజికవర్గం కాగా, రామకృష్ణ గౌడ సామాజికవర్గంకు చెందిన యువకుడు. భార్గవి తండ్రి కాస్త రాజకీయ పలుకుబడి ఉన్నవాడు కావడంతో పాటు ఆర్ధికంగా స్థితి మంతుడు. దీంతో వీరి ప్రేమ పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 16న భార్గవి – రామకృష్ణ లు పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తరువాత కొద్ది రోజులు లింగరాజుపల్లి గ్రామంలో ఆ తరువాత భువనగిరిలో కాపురం పెట్టారు. వీరికి ఆరు నెలల పాప ఉంది. రామకృష్ణ వివాహం అయిన తరువాత గుప్త నిధుల తవ్వకాల్లో సహకరించాన్న అభియోగంతో హోంగార్డు ఉద్యోగం నుండి తొలగించారు. దీంతో రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా రామకృష్ణ పని చేస్తూ కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాడు. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడం అవమానంగా భావించిన భార్గవి తండ్రి వెంకటేష్ అల్లుడు రామకృష్ణను అంతమొందించాలని ప్లాన్ చేసినట్లు సమాచారం. ఆ క్రమంలో కిరాయి హత్యలు చేసే రౌడీ షీటర్ లతీఫ్ కు సుపారి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. వెంకటేశ్ తో ఒప్పందం చేసుకున్న లతీఫ్ కొందరు వ్యక్తులతో ఫోన్ చేయించి కొనుగోలుకు భూమి చూపించాలంటూ హైదరాబాద్ శివారు ప్రాంతానికి రామకృష్ణ గౌడ్ ను తీసుకువెళ్లారు.

ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా

- Advertisement -

అయితే బయటకు వెళ్లిన భర్త రాత్రి సమయానికి రాకపోవడంతో భార్గవికి అనుమానం వచ్చి మొన్న సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టగా సిద్దిపేట కుకునూరు పల్లి వద్ద రామకృష్ణ గౌడ్ మృతదేహం ఉండటాన్ని గుర్తించారు. అతని ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరపగా భార్గవి తండ్రే వెంకటేశ్ రౌడీ షీటర్ తో ఈ హత్య చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. రామకృష్ణను ఓ స్తంభానికి కట్టేసి తలపై మేకులు కొట్టి మరీ హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

Most Popular

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...