Friday, March 29, 2024
Home వార్తలు Home guard Cheating: ఈ మహిళా హోంగార్డు తెలివితేటలు మామూలుగా లేవుగా..! ఏకంగా డీజీపీ, ఎస్పీ...

Home guard Cheating: ఈ మహిళా హోంగార్డు తెలివితేటలు మామూలుగా లేవుగా..! ఏకంగా డీజీపీ, ఎస్పీ సంతకాలనే ఫోర్జరీ చేసి..!!

- Advertisement -

Home guard Cheating: పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ మహిళా హోంగార్డును ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు సహకరించిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.  ఆమె చేసిన నిర్వాకం చూసి పోలీసులే అవాక్కు అయ్యారు. విషయం ఏమిటంటే…చెట్ల వాణి అనే మహిళ ఒంగోలు ఎస్పీ కార్యాలయంతో పాటు పలు పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులను నిర్వహించింది. తనకు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులతో పరిచయాలు ఉన్నాయనీ, హోంగార్డు పోస్టులు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద రూ.5లక్షలు వసూలు చేసింది. వారికి నకిలీ నియామక పత్రాలు అందించింది.

- Advertisement -

దీనిపై బాధితులు ఒంగోలు ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఆమె బండారం వెలుగు చూసింది. జిల్లా ఎస్పీ మలిక గార్గ్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు జరగా కీలక విషయాలు వెలుగుచూశాయి. హోంగార్డుగా పని చేస్తున్న వాణి…ఏకంగా ఏపీ డీజీపీ, జిల్లా ఎస్పీ ల పేరుతో లెటర్ హెడ్‌లు, నకిలీ స్టాంపులతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసింది. ఈజీగా డబ్బులు సంపాదించేందుకు హోంగార్డు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని భారీ స్కెచ్ వేసింది. నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్ తయారు చేసేందుకు డీటీపీ, స్టాంపుల తయారు చేసే మరో నలుగురిని తన బృందంలో వాణి చేర్చుకుంది. వీరి ద్వారా ఏపి డీజీపీ, జిల్లా ఎస్పీ ల పేరుతో లెటర్ హెడ్ లు, నకిలీ స్టాంపులతో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసింది. ఈ వ్యవహారం బయటపడటంతో వాణితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురుని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మలిక గార్గ్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను జైలుకు తరలించడం జరిగిందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...