Home వార్తలు Fire Accident: ఘోర అగ్నిప్రమాదం..! నలుగురు సజీవ దహనం..! ఎక్కడంటే..?

Fire Accident: ఘోర అగ్నిప్రమాదం..! నలుగురు సజీవ దహనం..! ఎక్కడంటే..?

Fire Accident: దేశ రాజధాని ఢిల్లీలో తరచు జరుగుతున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రతి నెలా ఎక్కడో ఒక చోట అగ్నిప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా ఓల్డ్ సీమాపురిలో నేటి తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవ దహనం అయ్యాయి. మరి కొందరు గాయపడ్డారు. ఓల్డ్ సీమాపురిలోని మూడంతస్తుల భవనంలో భారాగా మంటల వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక మరేదైనా కారణంగా జరిగిందా అనే విషయం విచారణలో తేలాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం కూడా ఢిల్లీలోని పాలం గ్రామంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరగ్గా ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురిని రక్షించారు. వీరిని రక్షించే క్రమంలో పోలీసులకు గాయాలు అయ్యాయి. అలాగే ఈ నెల 8వ తేదీన ఆగ్నేయ ఢిల్లీలోని ఓ గోడౌన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 18 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేయాల్సి వచ్చింది.