Thursday, April 25, 2024
Home వార్తలు పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

పల్నాడు లో ఐటీసీ గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

- Advertisement -

పల్నాడు జిల్లాలోని వంకాయలపాడు లో రూ.200 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఐటీసీ గ్లోబల్ స్పెసెస్ యూనిట్ ను శుక్రవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ యూనిట్ లో 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందని చెప్పారు. ఈ యూనిట్ వల్ల వేల మంది రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ద్వారా 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారని చెప్పారు. రెండవ దశ పూర్తి అయితే అతి పెద్ద స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ మన రాష్ట్రంలోనే ఉంటుందన్నారు. 24 నెలల్లో ఈ యూనిట్ ను ఐటీసీ పూర్తి చేసిందన్నారు. రానున్న కాలంలో రాష్ట్రానికి మరిన్ని స్పెసిస్ కంపెనీలు రావాలని ఆశిస్తున్నామన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడేళ్లుగా దేశంలోనే ఏపి నెంబర్ వన్ స్థానంలో ఉందని సీఎం పేర్కొన్నారు. రూ.3450 కోట్లతో ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ యూనిట్ల ద్వారా 33వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. మొదటి దశ కింద రూ.1250 కోట్లతో పది యూనిట్లకు డిసెంబర్, జనవరి నెలల్లో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరంగా మారనున్నాయని తెలిపారు. వీటి వల్ల రైతుల పంటకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తదుపరి సీఎం జగన్ గుంటూరు జిల్లా వైద్య కళాశాలకు చేరుకుని ప్లాటినం జూబ్లీ పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు విడతల రజిని, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...

Most Popular

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...

నిందితుడిని ఎంపిగా నిలబెట్టడం మీకు సమంజసమా ? : వైయస్ సౌభాగ్యమ్మ

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డికి మరలా ఎంపిగా అవకాశం కల్పించడం మీకు సమంజసమా ? మిమ్మలని సీఎంగా చూడాలని ఎంతో తపించిన మీ...

మీకోసం పాదయాత్ర చేసిన వారు గుర్తులేరా? వైయస్సార్ ను అవమానించిన వారే గుర్తున్నారా ? : షర్మిల

రాజశేఖర్‌ రెడ్డి కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన ప్రతి ఒక్కరికీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి పెద్దపీట వేశారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో నిండు వేదికగా రాజశేఖర్‌...