Home వార్తలు Breaking: జిల్లాలో విషాదం .. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి

Breaking: జిల్లాలో విషాదం .. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి

Breaking: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కవలకుంట్ల, కొత్తూరు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా తీర్చుకోవడం కోసం చెరువులోకి వెళ్లిన నలుగురు విద్యార్ధులు మృతి చెందారు. ఈత కొట్టేందుకు నలుగురు చిన్నారులు కవలకుంట్ల చెరువులోకి దిగారు. కొద్దిసేపు సరదాగా గడిపారు. అంతలోనే ప్రమాదవశాత్తు ఆ నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

మృతులు సాయిరెడ్డి (12), విష్ణుకుమార్ రెడ్డి (13), బ్రహ్మరెడ్డి (14), మణికంఠ (14)గా గుర్తించారు. చిన్నారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెండటంతో గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు చూపరులకు కంటనీరు తెప్పించాయి.

Exit mobile version