Haryana: హరియాణా రాష్ట్ర గవర్నర్గా బండారు దత్తాత్రేయ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ ప్రదాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్లో గవర్నర్గా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టారు. కరోనా నిబంధనల నేపథ్యంలో కార్యక్రమానికి కొద్ది మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే హజరయ్యారు. హరియాణ సీఎం మనోహర్ లాల్, డిప్యూటి సీఎం దుష్యంత్ చౌతాలా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇటీవల వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం హరియాణాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర అర్లేకర్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా 1980లో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన దత్తాత్రేయ పలు మార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైయ్యారు.